న్యూఢిల్లీ, అక్టోబర్ 20: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో వచ్చే వారం లా కమిషన్ భేటీ కానుంది. ఈ నెల 25న జమిలి ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కమిటీకి సమర్పించనుంది.
పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపాల్టీ తదితర ఎన్నికలను దేశంలో ఏకకాలంలో నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలంటూ ఈ నెల 25న జరిగే సమావేశానికి లా కమిషన్ను కమిటీ ఆహ్వానించింది.