Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. షోపియాన్ (Shopian) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు (Lashkar terrorist killed).
ఆ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన నలుగురు టెర్రరిస్ట్లు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, పారామిలిటరీ దళాలు మంగళవారం ఉదయం ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తొలుత కుల్గామ్లో ఎన్కౌంటర్ మొదలైంది. తర్వాత షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజా ఘటనతో ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలను ఊటంకిస్తూ ఇండియా టుడే తెలిపింది.
Also Read..
Blasts | రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు.. ముంబై పోలీసులకు బెదిరింపు మెయిల్
Schools reopen | కశ్మీర్లో తెరుచుకున్న పాఠశాలలు