Landslides | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని పిథోర్గఢ్ (Pithoragarh) జిల్లాలో భారీగా కొండ చరియలు (Landslides) విరిగిపడ్డాయి. కైలాస్ యాత్ర ప్రధాన మార్గం (Kailash Yatra route)లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వందలాది మంది కైలాస మానసరోవర్ యాత్ర యాత్రికులు (pilgrims stranded) అక్కడ చిక్కుకుపోయినట్లు తెలిసింది.
కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఇరువైపులా వందలాది మంది స్థానికులు, యాత్రికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించి రోడ్డు పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. పర్వత ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే, విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Also Read..
Pakistani shell | పూంచ్లో పాక్ లైవ్ షెల్.. ధ్వంసం చేసిన భారత ఆర్మీ
Corona Virus | మహారాష్ట్రలో కోరలు చాస్తున్న కరోనా.. వారం రోజుల్లోనే భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు