Sabarimala | కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala) వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పంబ (Pampa) సమీపంలో కేఎస్ఆర్టీసీ బస్సు (KSRTC bus)లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.
నిలక్కల్ నుంచి శబరిమల యాత్రికులతో పంబ వెళ్తున్న బస్సులో శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సులోంచి బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పలువురు భక్తులకు గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్ (Short Circuit) కారణంగానే ఈ ప్రమాదం సభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Railways | పొగమంచు కారణంగా.. రైల్వేకి రూ.1.22 కోట్ల మేర నష్టం
Justin Trudeau | మరోసారి మొరాయించిన ట్రూడో అధికారిక విమానం.. నాలుగు నెలల్లో రెండోసారి
Heeralal Nagar | మంత్రిని సన్మానిస్తుండగా కూలిన వేదిక.. 40 మందికి గాయాలు