న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి బుధవారం నాటికి ప్రజల నుంచి 5 వేల సూచనలు అందాయి.
దేశంలో జమిలి ఎన్నికల విధానం అమలుకు ప్రస్తుతం అమలవుతున్న చట్టపరమైన పరిపాలనా విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై సలహాలు, సూచనలు ఈ నెల 15లోగా ఇవ్వాలంటూ గత వారం కోవింద్ కమిటీ చేసిన విజ్ఞప్తిపై ఇప్పటివరకు 5 వేల ఈ-మెయిల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన కమిటీ ఆరు జాతీయ, 33 రాష్ట్ర రాజకీయ పార్టీలతో పాటు, ఏడు గుర్తింపు లేని పార్టీల నుంచి అభిప్రాయాలను కోరింది.