Bomb Threat | విమానాల్లో సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపులు (Bomb Threat) ఇటీవలే కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. గతవారం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్న ఓ ఇండిగో (IndiGo) విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన 6E 2706 విమానం మస్కట్ నుంచి కొచ్చి మీదుగా ఢిల్లీ వెళ్తోంది. అయితే, విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నాగ్పూర్ (Nagpur) ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు (Emergency Landing). అక్కడ ప్రయాణికులందరినీ కిందకు దింపి.. తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదని నాగ్పూర్ డీసీపీ లోహిత్ మతాని తెలిపారు.
An IndiGo flight 6E 2706 from Muscat – Kochi – Delhi made an emergency landing at Nagpur airport after a bomb threat was received. All passengers have been deboarded, investigation is underway, nothing suspicious has been found so far: Lohit Matani, DCP Nagpur
— ANI (@ANI) June 17, 2025
Also Read..
Indian Students | ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి
bus fell into a gorge | హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ బస్సు.. 17 మందికి గాయాలు
Corona Virus | 7 వేల దిగువకు పడిపోయిన కరోనా యాక్టివ్ కేసులు