Kidneys to sell | ముంబై(నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. నాందేడ్ జిల్లాలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద కిడ్నీలు అమ్ముతామంటూ పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ కిడ్నీలు అమ్మేందుకు సిద్ధపడటమే ఆ రాష్ట్రంలోని రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నది. జిల్లాకు చెందిన ఓ వ్యవసాయ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో ఒకే కుటుంబంలోని తండ్రి, పెద్ద కుమారుడు, రెండో కుమారుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తీసుకున్న రెండు లక్షల రూపాయల అప్పు తీర్చే దారిలేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కిడ్నీలు అమ్మేందుకు సిద్ధమయ్యారు.
నాందేడ్ జిల్లా సిల్లోడ్ తాలుకా పింపల్గావ్ పేట్కు చెందిన యువ రైతు సోమనాథ్ పండిత్ బోసలే (౩౦) అప్పుల పాలై గురువారం రాత్రి తన పొలంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 15 ఏండ్ల క్రితం సోమనాథ్ తండ్రి పండిత్ మాణిక్ రావు బోసలే, 19 లో సోమనాథ్ పెద్దన్న గజానన్ మాణిక్ రావు బోస లే బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి, పెద్దన్నల ఆత్మహత్యల తర్వాత కుటుంబ భారం సోమనాథ్పై పడటంతో పాటు అప్పులు కొండలా పెరిగిపోవడంతో సోమనాథ్ పండిత్ బోసలే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కిడ్నీలు అమ్మేందుకు సిద్ధమయ్యారు.