న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కెప్టెన్గా వ్యవహరిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ప్రజల ముందుకు ఏ తీరుగా రావాలనుకునేది ఆమె నిర్ణయించుకోవాలని అన్నారు. ప్రియాంక ఇమేజ్తో యూపీ ఎన్నికల్లో ఆమె పార్టీకి కెప్టెన్గా ముందుండి నడిపిస్తారని ఖుర్షీద్ స్పష్టం చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తాననే నిర్ణయాన్ని ఆమె వెల్లడిస్తారని ఖుర్షీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు మాత్రం ప్రియాంకను తమ కెప్టెన్గా భావిస్తున్నారని, తమకు ఆమె దిశానిర్ధేశం చేస్తారని వేచిచూస్తున్నారని అన్నారు. మరోవైపు యూపీలో నాయకత్వ మార్పు ఊహాగానాలకు బీజేపీ తెరదించింది. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ సింగ్ పేర్కొన్నారు.