న్యూఢిల్లీ: మాజీ ఇన్వెస్టర్ దివంగత రాకేశ్ జున్జున్వలా(Rekha Jhunjhunwala) భార్య రేఖా జున్జున్వాలా సోమవారం ఒక్క రోజే 800 కోట్లు నష్టపోయారు. టైటాన్ కంపెనీకి చెందిన షేర్లు పడిపోవడంతో ఆమెకు ఆ నష్టం జరిగింది. టాటా గ్రూపు కంపెనీకి చెందిన టైటాన్ సంస్థలో జున్జున్వాలాకు పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నాయి. రేఖా జున్జున్వాలాకు సుమారు 5.35 శాతం వాటా ఉన్నది. ఆమె వాటా విలువ సుమారు 16,792 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సోమవారం రోజున టైటాన్ కంపెనీకి చెందిన షేర్లు ఏడు శాతం పడిపోవడం వల్ల రేఖకు భారీ నష్టం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ కంపెనీ షేర్ విలువ రూ.3,352 నుంచి 3,281.65కు పడిపోయింది. కంపెనీ విలువ మూడు లక్షల కోట్ల నుంచి రెండు లక్షల 91 వేలకు పడిపోయింది. దీంతో 22 వేల కోట్ల నష్టం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రేఖా జున్జున్వాలా వాటా 15,986 కోట్ల పడిపోయినట్లు మార్గెట్ వర్గాలు తెలిపాయి.