ధర్మశాల, మే 8: హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న అసెంబ్లీ భవన ఆవరణలో ఖలిస్థాన్ జెండాల కలకలం రేగింది. అసెంబ్లీ గేటు, ప్రహరీ గోడలపై ఆదివారం తెల్లవారుజామున జెండాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో పాటు గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని వాటిని తొలగించారు.
ఈ ఘటనను హిమాచల్ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ఖండించారు. ఇది ఓ పిరికిపంద చర్య అంటూ మండిపడ్డారు. జాతీయ భద్రతపై భరోసా కల్పించడంలో, రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కాపాడటంలో బీజేపీ సర్కార్ విఫలమైందని ఆప్ విమర్శించింది.