న్యూఢిల్లీ : (Blue Flag) మన దేశంలోని మరో రెండు బీచ్లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేట్లు వచ్చాయి. దీంతో ఈ సర్టిఫికేట్లు పొందిన బీచ్ల సంఖ్య 10 కి చేరుకున్నది. ప్రస్తుతం ‘బ్లూ ఫ్లాగ్’ పొందినవాటిలో కేరళకు చెందిన కోవలం బీచ్, పుదుచ్చేరికి చెందిన ఈడెన్ బీచ్ ఉన్నాయి. ఈ విషయాలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత ఏడాది 8 బీచ్లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేట్ అందగా.. ఈ ఏడాది రెండు బీచ్లు ఆ ధ్రువీకరణ పొందాయి.
డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) బీచ్లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్లను అందించడానికి పనిచేస్తుంది. ఇది ఒక రకమైన ఎకో-లేబుల్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఉపయోగపడుతుంది. అనేక స్థాయిల్లో పరీక్షించిన తర్వాతే ఈ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, బీచ్ భద్రత, సేవలు వంటి 33 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బీచ్లే ఈ సర్టిఫికెట్ను పొందుతాయి.
శివరాజ్పూర్ (గుజరాత్)
ఘోఘల-దీయు, కాసర్కోడ్, పదుబిద్రి (కర్నాటక)
కప్పడ్ (కేరళ)
రుషికొండ (ఆంధ్రప్రదేశ్)
గోల్డెన్ (ఒడిశా)
రాధానగర్ (అండమాన్, నికోబార్)
కోవలం (కేరళ)
ఈడెన్ (పుదుచ్చేరి)
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఐఆర్సీటీసీ ‘లేహ్-లడఖ్’ పర్యాటక ప్యాకేజీ సిద్ధం..
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
కెప్టెన్కు షాకిస్తున్న సీఎం చన్నీ
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి