తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ రోజుకు పదివేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 11,647 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదవుతున్నా అందుకు తగ్గట్టుగానే రికవరీ అయ్యేవారి సంఖ్య కూడా ఉంటుంది.
ఇవాళ కూడా 12,459 మంది కరోనా బాధితులు ఆ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 26,90,958కి చేరింది. అదేవిధంగా ఇవాళ కొత్తగా 112 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,060కి చేరింది. ప్రస్తుతం కేరళలో 1,05,936 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.