తిరువనంతపురం: కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వంపై కేరళ సీఎం విజయన్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక విధానాన్ని మోదీ సర్కార్ ప్రమాదం లో పడేస్తున్నదని శనివారం విమర్శించారు. దేశ లౌకికత్వంపై కేంద్ర ప్రభుత్వం వరుసగా చేస్తున్న దాడి వ ల్ల దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న చాలా మంది ప్రజలు ఇకపై భారత్లో జీవించగలమా? అని ఆందోళన చెందుతున్నారని విజయన్ పేర్కొన్నారు.