Arvind Kejriwal : ఈ కాలంలో రాముడు ఉండి ఉంటే ఈడీ వంటి దర్యాప్తు సంస్ధలతో వేధించి ఆయనను కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసేవారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీలో చేరాలని లేకుంటే జైలులో ఉంటారని రాముడినీ ఒత్తిడి చేసేవారని బీజేపీని దుయ్యబట్టారు.
కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసిన నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈడీ సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోని విషయం తెలిసిందే. ఆప్ సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తే బీజేపీ ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విపక్ష ప్రభుత్వాలను వేధించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
మరోవైపు కేజ్రీవాల్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. రాజకీయ అంశాల్లో రాముడి పేరు లాగడం తగదని, ఇది కోట్లాది భకత్ఉల మనోభావాలను దెబ్బతీస్తుందని కేజ్రీవాల్పై కాషాయ పార్టీ మండిపడింది. సానుభూతి పొందేందుకు ఆప్ నేతలు తరచూ రాముడి పేరును ప్రస్తావించడం విచారకరమని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ అన్నారు.
Read More :
Prabhas | మై బ్రదర్.. నేను నమ్మలేకపోతున్నా.. The Goat Life ట్రైలర్పై ప్రభాస్