న్యూఢిల్లీ: (Sonia Gandhi) ‘విధానపరమైన విషయాలపై స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి. కానీ, ఒక్కొక్కరు ఒక్కో ఎజెండా పెట్టుకుని మాట్లాడితే మంచిది కాదు. అది పార్టీకి నష్టం కలిగిస్తుంది. అలాంటి పనులు చేయకండి’ అని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలకు సూచించారు. మంగళవారం ఢిల్లీలోని ఐఏసీసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంఛార్జీలు, రాష్ట్ర శాఖల అధ్యక్షులతో సోనియాగాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలకు క్రమశిక్షణ, ఐక్యతకు సంబంధించి హితబోధ చేశారు.
వ్యక్తిగత ఆశయాలు పార్టీ పటిష్టతపై ప్రభావం చూపకూడదన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలని నేతలకు సోనియాగాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సందేశం కిందిస్థాయి కార్యకర్తలకు చేరడం లేదని, విధానపరమైన విషయాల్లో రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని అభిప్రాయపడ్డారు. దీనిపై వారి అభిప్రాయాలు స్పష్టంగా లేవని గ్రహించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పార్టీ కార్యకర్తలు అసత్యాలు, ప్రచారాలను గుర్తించి వ్యతిరేకించాలని సూచించారు. ప్రభుత్వ దుర్మార్గాలపై పోరాటాన్ని రెట్టింపు చేయాలన్నారు. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే వారి అబద్ధాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ సమావేశానికి రాహుల్ ప్రియాంకతోపాటు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నేతలకు సోనియా దిశానిర్దేశం చేశారు.
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..