డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మూసివేశారు. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆలయాలను మూసివేశారు. ఉదయం 8 గంటలకు కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల ద్వారాలను మూశారు. మళ్లీ ఆర్నెళ్ల తర్వాత చార్థామ్ యాత్రకు సంబంధించిన ఆలయాలు తెరుచుకుంటాయి. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ తలపులను పూజరులు వేశారు. నిజానికి ఈ ఏడాది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆలయాలను తెరిచారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో చార్థామ్ యాత్రకు మొదటల్లో అనుమతి ఇవ్వలేదు. అయితే శుక్రవారం ప్రధాని మోదీ కేదార్నాథ్లో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.