రుద్రప్రయాగ్: ఇవాళ మధ్యాహ్నం పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుండటంతో చార్ధామ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను మూసివేశారు. సూర్యగ్రహణం వీడిన తర్వాత ఈ సాయంత్రం ఆ రెండు ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
సూర్యగ్రహణం వీడిన అనంతరం కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తిరిగి తెరుస్తామని, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయాల కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. ఈసారి సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కనిపించనుంది. సూర్యస్తమయానికి ముందు మొదలయ్యే ఈ సూర్యగ్రహణం చాలా ప్రాంతాల నుంచి కనిపించనుంది.