Karti Chidambaram : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సామ్ పిట్రోడా వివాదస్పద వ్యాఖ్యలను శివగంగ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధి కార్తి చిదంబరం తోసిపుచ్చారు. పిట్రోడా వ్యాఖ్యలతో సంబంధం లేదని పార్టీ ఇప్పటికే తేల్చిచెప్పిందని తెలిపారు. సామ్ పిట్రోడా తమ పార్టీ చీఫ్ కాదని, ఈ దేశ ప్రధానో, ఓ పార్టీ అధ్యక్షుడో కాదని అన్నారు. ఆయన పార్టీ పదవికి కూడా రాజీనామా చేశారని గుర్తుచేశారు.
ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పార్టీ కూడా స్పష్టం చేసిందని అన్నారు. ఇక తమిళనాడులో 39 లోక్సభ స్ధానాల్లో విపక్ష కూటమి విజయం సాధిస్తుందని కార్తీ చిదంబరం విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, భారత్లో దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా, ఈశాన్య ప్రాంత ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ ప్రాంత వాసులు అరబ్బుల్లా కనిపిస్తారని సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
ఎన్నికలకు ముందు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ పదవికి ఆయన రాజీనామా చేశారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని, ఆ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Read More :
Renuka Chowdhury | జీవన్ రెడ్డికి అనవసరంగా ఎంపీ టికెట్ ఇచ్చారు.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు