Renuka Chowdhury | నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పట్ల ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. జీవన్ రెడ్డికి అనవసరంగా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు.
మండవ వెంకటేశ్వర్ రావుకు నిజామాబాద్ టికెట్ ఇవ్వాల్సి ఉండే. ఆయన అక్కడ స్థానికులు. అక్కడ్నుంచి ఇక్కడ మైగ్రేట్ అంటే ఖమ్మం కార్యకర్తలు ఒప్పుకోలేదు. వాస్తవానికి మండవ వెంకటేశ్వర్ రావు నిజామాబాద్ టికెట్ ఇవ్వాల్సింది. జీవన్ రెడ్డి అల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ. అనవసరంగా ఇప్పుడు రెండు సీట్లు గెలికినట్లు అయింది. ఇక ఖమ్మం ఎంపీ సీటు భట్టి విక్రమార్క భార్యకు, తుమ్మల నాగేశ్వర్ రావుకు కుమారుడికి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కార్యకర్తలు ఒప్పుకోలేదు అని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.
జీవన్ రెడ్డికి అనవసరంగా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు.
జీవన్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ.. నిజామాబాద్ ఎంపీ సీట్ మండవ వెంకటేశ్వరరావుకు ఇవ్వాల్సింది – కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
Video Credits – Rtv pic.twitter.com/Kz710UhAl1
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2024