బెంగళూరు: కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కంప్లీట్ కర్ఫ్యూ విధించింది. ఏప్రిల్ 27న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ కంప్లీట్ కర్ఫ్యూ మే 12న ఉదయంతో ముగియనున్నది. అయితే ఈ కంప్లీట్ వల్ల కర్ఫ్యూ వల్ల ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో మే 12 నుంచి కంప్లీట్ లాక్డౌన్ విధించాలని కర్ణాటక సర్కారు భావిస్తున్నది. మంగళవారం జరిగిన కర్ణాటక క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా వేగంగా విస్తరిస్తున్నది. మంగళవారం అక్కడ 40,128 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 22,112 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 55 శాతానికి చేరింది. గత వారంలో 12 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ఒక్కసారిగా 55 శాతానికి పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. కాగా, కర్ణాటకలో మంగళవారం కొత్తగా 44,631 కొత్త కేసులు నమోదయ్యాయి. 288 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన