Karnataka | కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డితో పాటు పలువురిపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా సోదాలు నిర్వహించినట్లు సమాచారం. బళ్లారిలోని 34 ఏళ్ల ఎమ్మెల్యే నివాసంతో పాటు కర్ణాటక, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. బళ్లారి, బెంగుళూరులోని నారా భరత్రెడ్డి ఆస్తులపై కేంద్ర ఏజెన్సీ అధికారులు దాడులు చేశారు. ఆయనపై మనీలాండరింగ్ కేసు కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. భూ సంబంధిత లావాదేవీలకు సంబంధించిన ఈ కేసును ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్నది.