Raja Venkatappa Naik | కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సురపుర (Shorapur constituency) నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే (Congress MLA) రాజా వెంకటప్ప నాయక్ (67) మృతి చెందారు. ఆదివారం ఉదయం గుండెపోటుతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితమే గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆయన సన్నిహితుడు.
ఎమ్మెల్యే మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య (Siddaramaiah) విచారం వ్యక్తం చేశారు. ‘నా చిరకాల రాజకీయ సహచరుడు రాజా వెంకటప్ప నాయక్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. మూడు రోజుల క్రితం ఆయనను కలిశా. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. పరోపకారి అయిన రాజా వెంకటప్ప నాయక్ మరణం వ్యక్తిగతంగా, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని సిద్ధ రామయ్య ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
ಸುರಪುರದ ಶಾಸಕರು, ಬಹುಕಾಲದ ನನ್ನ ರಾಜಕೀಯ ಒಡನಾಡಿ ರಾಜ ವೆಂಕಟಪ್ಪ ನಾಯಕ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ಅತೀವ ನೋವುಂಟುಮಾಡಿದೆ. ಮೂರು ದಿನದ ಹಿಂದೆಯಷ್ಟೇ ಅವರನ್ನು ಭೇಟಿಮಾಡಿ ಆರೋಗ್ಯ ವಿಚಾರಿಸಿದ್ದೆ.
ಜನಾನುರಾಗಿ ವ್ಯಕ್ತಿತ್ವದ ರಾಜಾ ವೆಂಕಟಪ್ಪ ನಾಯಕ ಅವರ ಅಗಲಿಕೆ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಮತ್ತು ರಾಜ್ಯ ರಾಜಕಾರಣಕ್ಕೆ ತುಂಬಿಬಾರದ ನಷ್ಟ. ಮೃತರ ಆತ್ಮಕ್ಕೆ… pic.twitter.com/Fls5GfaRGs
— Siddaramaiah (@siddaramaiah) February 25, 2024
Also Read..
Houthi Rebals | అమెరికా నౌకపై మిస్సైళ్లతో దాడి.. మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్
Drug Racket | భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. పరారీలో సినీ నిర్మాత
Mann Ki Baat | లోక్సభ ఎన్నికలు.. మన్ కీ బాత్కు తాత్కాలిక బ్రేక్