బెంగళూర్ : కర్నాటక కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బీజేపీకి శత్రుదేశం కావచ్చని, తమకు కాదని ఆయన స్పష్టం చేశారు. కాషాయ పార్టీకి పాక్ శత్రుదేశమైనా, కాంగ్రెస్ పార్టీ మాత్రం పాక్ను పొరుగు దేశంగానే పరిగణిస్తుందని హరిప్రసాద్ పేర్కొన్నారు. కర్నాటక రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం అనంతరం అసెంబ్లీలో పాక్ అనుకూల నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించిన నేపధ్యంలో హరిప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ శత్రు దేశం అంటున్నారు. లాహోర్లోని జిన్నా సమాధిని సందర్శించి, ఆయన వంటి సెక్యులర్ నాయకుడు మరొకరు లేరని చెప్పిన ఎల్కె అద్వానీకి ఇటీవల వారు భారతరత్న ప్రదానం చేశారు. అప్పుడు పాకిస్తాన్ శత్రు దేశం కాదా? అని హరిప్రసాద్ శాసనమండలిలో మాట్లాడుతూ కాషాయ పార్టీని నిలదీశారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారత్పై పాక్ నాలుగు సార్లు యుద్ధానికి తలపడినా ఆ దేశాన్ని శత్రు దేశమని కాంగ్రెస్ చెప్పడం లేదని ఆక్షేపించింది. కాంగ్రెస్ పార్టీ జాతి వ్యతిరేక భావాలను కలిగిఉందని ఆరోపించింది. నెహ్రూ-జిన్నా మధ్య సాన్నిహిత్యాన్ని ప్రస్తుత తరం కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోందని, పాక్ బీజేపీకి శత్రువు కాంగ్రెస్కు పొరుగుదేశమని చెప్పడం దీన్ని స్పష్టం చేస్తోందని బీజేపీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
Read More :
Wild fire | టెక్సాస్ను కమ్మేసిన కార్చిచ్చు.. 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటన