బెంగళూరు: నిరసన పేరుతో రోడ్లను దిగ్బంధం చేసి, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్న 2022నాటి కేసులో సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలన్న ఆయన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఆయనతో సహా మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగా రెడ్డి, కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాకు రూ.10 వేలు జరిమానా విధించింది.
మార్చి 6న ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని సీఎం సిద్ధరామయ్యకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. గత బీజేపీ సర్కార్ పాలనలో కాంట్రాక్టర్ సంతోశ్ పాటిల్ ఆత్మహత్య సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీని చేపట్టడంపై కేసు నమోదైంది.