బెంగళూరు: ప్రస్తుతం దేశంలోని రాజకీయాలు విషపూరితంగా మారాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల ప్రధాని మోదీని విష సర్పంగా అభివర్ణించారు. ప్రతిపక్షాలపై ఆయన విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కౌంటర్గా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె విషకన్య (vishkanya) చైనా-పాకిస్థాన్ ఏజెంట్ అని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఆరోపించారు. శుక్రవారం యత్నాల్లోని కొప్పల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీకి గతంలో వీసా నిరాకరించిన అమెరికా ఆ తర్వాత ఆయనకు రెడ్ కార్పెట్ పరిచిందని అన్నారు. అలాంటి మోదీని కాంగ్రెస్ పార్టీ విష సర్పంతో పోల్పడంపై మండిపడ్డారు. ‘సోనియా గాంధీనే విష కన్య. చైనా, పాకిస్థాన్ ఏజెంట్గా ఆమె పని చేసింది’ అని ఆరోపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, సోనియా గాంధీని విషకన్య అన్న బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇప్పుడు ఏం చెబుతారు? అని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ ప్రశ్నించారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంలో బీజేపీ నేతలు ఉన్నారని, అందుకే సోనియా గాంధీని అవమానించేలా ఇలా మతిలేని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా దుయ్యబట్టారు.
A Karnataka BJP MLA has called Mrs Sonia Gandhi a 'Vishkanya'. People want to know what PM Modi & Amit Shah have to say on this issue: Bhupesh Baghel, Chhattisgarh CM, in Raipur pic.twitter.com/aHsphHj0Up
— ANI (@ANI) April 28, 2023