Fire Accident | గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 22 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో 12 మంది చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. లోపల మరింత మంది చిక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా, పెద్ద ఎత్తున గాలి దుమారం వచ్చినప్పటికీ శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, మృతుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయలేమని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఆర్ఏ జోబన్ తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
#WATCH | Gujarat: A massive fire breaks out at the TRP game zone in Rajkot. Fire tenders on the spot. Further details awaited. pic.twitter.com/f4AJq8jzxX
— ANI (@ANI) May 25, 2024
#WATCH | Rajkot, Gujarat: Fire officer IV Kher says, “The reason for the fire is yet to be ascertained. The attempts to douse the fire are underway. We have not received any message of missing persons. We are facing difficulty in the firefighting operation because the temporary… https://t.co/Gd9N1Pd8ka pic.twitter.com/v09kJcL0V3
— ANI (@ANI) May 25, 2024