Sanga Reddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా అగ్గి మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇదే గోదాంలో కెమికల్ డ్రమ్ములు భారీగా నిల్వ ఉండడంతో వాటికి నిప్పు అంటుకున్నది. ఫలితంగా భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలానికి సమీపంలో రసాయన పరిశ్రమలు ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అగ్ని మాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.