బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని జనతాదళ్ (ఎస్) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారని చెప్పారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అసమర్థ పాలనతో కన్నడ ప్రజలు విరక్తి చెందారని ఆయన తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జేడీఎస్ను విమర్శించడానికి ఏ అస్త్రం లేదని, అందుకే జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్ అని బీజేపీ వాళ్లు, బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ వాళ్లు విమర్శిస్తున్నారని, తాము ఆ రెండు పార్టీలకు బీ టీమ్ కాదని, కన్నడిగులకు బీ టీమ్ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ప్రజలు తమకు భారీ మెజారిటీ విజయం కట్టబెట్టబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 20 వరకు గడువు నిర్ణయించింది. మే 10న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి, మే 13న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.
#WATCH | Kannadigas have decided to elect a regional party. This time they will reject both national parties, says JD(S) leader HD Kumaraswamy on May 10 Karnataka Assembly polls. pic.twitter.com/DzJ7402KRQ
— ANI (@ANI) March 29, 2023