Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ (Kamal Nath) కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు గత మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన త్వరలో బీజేపీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, పార్టీ మార్పుపై కమల్నాథ్ తాజాగా స్పందించారు. తాను కమలం పార్టీలో చేరడం లేదని, హస్తం పార్టీలోనే కొనసాగుతానని సోమవారం స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని నివాసంలో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.
కాగా, కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కమల్ నాథ్ బీజేపీలో చేరడం లేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఆదివారం తెలిపారు. తాను ఆయనతో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే కమల్ నాథ్కు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేశారు. గాంధీ కుటుంబంతో కమల్ నాథ్కు ఉన్న అనుబంధం తిరుగులేనిదని, ఆయన కాంగ్రెస్ భావజాలంతో జీవించారని, చివరి వరకు కాంగ్రెస్తోనే ఉంటారని జితూ పట్వారీ అన్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా హస్తం పార్టీపై కమల్నాథ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కమల్నాథ్ చింధ్వారా స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా చేశారు. ప్రస్తుతం అదే చింధ్వారా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పీసీసీ అధ్యక్షుడిగా తొలగించిన విధానంపై కమల్నాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుమారుడితో కలిసి ఆయన హస్తం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని, త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
Also Read..
Plane Villa | ఫ్లైట్ను లగ్జరీ విల్లాగా మార్చిన వ్యక్తి.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. VIDEO
Gulmarg | గుల్మార్గ్లో స్కీయింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న విదేశీ పర్యాటకులు.. వీడియో