Loksabha Elections 2024 : భారత్ ఏ ఒక్కరికీ చెందినది కాదని, ప్రతి ఒక్క భారతీయుడిదని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పకుర్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము స్ధానికుల హక్కులను కాపాడటం గురించి మాట్లాడుతున్నామని, కులం, మతం బదులు ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మనం మాట్లాడాలని ఆమె పేర్కొన్నారు.
ఇక అంతకుముందు జార్ఖండ్లోని దుంకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని అన్నారు. మోదీ జీవించినంత వరకూ గిరిజనులు, దళితులు, బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల వారి రిజర్వేషన్లను ఎవరూ తొలగించిలేరని ఆయన స్పష్టం చేశారు.
ఆదివాసీలు, దళితులు, ఓబీసీల కోటాను గుంజుకుని వాటిని ఓట్ జిహాద్కు పాల్పడే ముస్లింలకు అప్పగించడాన్ని తాను అనుమతించబోనని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో చొరబాటుదారుల ముప్పు నెలకొందని పలు ప్రాంతాల్లో చొరబాట్ల సవాళ్లు ఎదుర్కొంటున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య తగ్గుముఖం పడుతూ చొరబాటుదారుల సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల భూములను చొరబాటుదారులు గుంజుకుంటున్నారా..లేదా..? అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read More :
Dubbaka | అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం