రాంచీ : జార్ఖండ్ గవర్నర్ లక్ష్యంగా జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతలు విమర్శలు గుప్పించారు. గవర్నర్ పదవి హుందా తనాన్ని కాపాడుకోవాలని జేఎంఎం ప్రతినిధి మనోజ్ పాండే పేర్కొన్నారు. జార్ఖండ్ గవర్నర్ బీజేపీ అజెండాను నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.
అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు ఉన్నారని, వారు ఎవరైనా గ్రామాలను సందర్శిస్తున్నారా, జార్ఖండ్ గవర్నర్కు కూడా ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తున్నాయా అని పాండే ప్రశ్నించారు. జార్ఖండ్ ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు.
కాగా, గవర్నర్ వ్యవహారంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ గవర్నర్ మూడేండ్లుగా రాష్ట్రంలో ఉంటున్నారని, ఆయన ఎక్కడికి వెళ్లినా తాము నియంత్రించలేదని స్పష్టం చేశారు. గవర్నర్పై జేఎంఎం నేతలు చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
Read More :