నర్సాపూర్, జూలై 1 : తల్లీపిల్లల ఆరోగ్యం కూ డా పల్లె, పట్టణప్రగతి కార్యక్రమంలో భాగమేనని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ పే ర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్లో నాల్గో విడుత పల్లెప్రగతి గ్రామసభలో సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రి యాంకా వర్గీస్, ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్ దేవేందర్రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామాలను పరిశీలించారు. గ్రామసభలో సమస్యలు అ డిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ మాట్లాడా రు. ప్రతి ఇంటింటికి మొక్కలను అందించి నాటించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఎంత మంది పిల్లలు బలహీనంగా ఉన్నారో తెలుసుకొని, వారికి పౌష్టికాహారం అందజేసి, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గ్రామం పరిశుభ్రం గా ఉండేలా చూసుకోవాలని గ్రామస్తులకు సూ చించారు. గ్రామంలో 120 మంది పిల్లలుండగా, అందులో 20మంది పిల్లలు బలహీనంగా ఉండడానికి కారణమేంటని అధికారులను ప్రశ్నించా రు. 20మంది పిల్లలు కూడా మిగతా పిల్లల్లాగా ఆరోగ్యంగా ఉండేలా చూడాలని సూచించారు. అ లాగే వైకుంఠధామంలో నీటి సరఫరా త్వరగా చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. వైకుంఠధామంలో ఖాళీ స్థలంలో మొక్క లు నాటాలని అటవీశాఖ అధికారులకు తెలిపారు.
మున్సిపాలిటీల కంటే గ్రామాలే బాగున్నాయి.. : కలెక్టర్ హరీశ్
పల్లెప్రగతి చేపట్టిన నుంచి మున్సిపాలిటీల కంటే గ్రామాలే బాగున్నాయని మెదక్ కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. గ్రామసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విద్యుత్, నీరు, ఆరోగ్యం తదితర సమస్యలపై చర్చించాలని గ్రామస్తులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు ముందుండాలని, వారితోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు హేమలతాశేఖర్ గౌడ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మసర్పంచ్ ఇష్రాత్ ఫాతిమా, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఎంపీడీవో మార్టీన్ లూథర్, తహసీల్దార్ తబితారాణి, వివిధ శాఖల అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి సాధ్యం : సీఎం కార్యాలయ ఓఎస్డీ
పల్లెప్రగతిలో అందరూ కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు లేని చోట మొక్కలు నాటి, వాటి రక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో చాలా మార్పు వచ్చిందని గుర్తు చేశారు. గ్రామాల్లో అవసరమున్న మొక్కలను నాటించాలని అధికారులకు సూచించారు. మొక్కలతోనే గ్రామానికి అందం వస్తుందన్నారు.
మహిళల్లో చైతన్యం వచ్చింది : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్
తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలతో మహిళల్లో చైతన్యం పెరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పల్లెల్లో మార్పు రావాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారని గుర్తుచేశారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో గ్రోత్ మానిటర్పై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని, పిల్లల్లో బలహీనతలను తగ్గించేందుకు పాటుపడుతామని సభాముఖంగా తెలియజేశారు. గృహహింసపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రూ. 55కోట్లతో సీసీ రోడ్లు వేయించా : ఎమ్మెల్యే మదన్రెడ్డి
నర్సాపూర్ మండల వ్యాప్తంగా 55 కోట్ల తో సీసీ రోడ్లు వేయించామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలకు తెలంగాణ దిక్చూచిల సీఎం కేసీఆర్ చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో వీధివీధికి సీసీ రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నారాయణపూర్లో డబుల్ బెడ్రూమ్లను అందించేలా సహకరించాలని స్మితాసబర్వాల్ను కోరారు.