పట్నా : మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో ప్రధాని నరేంద్ర మోదీపై జేడీ(యూ) నేత ప్రశంసలు గుప్పించి వివాదానికి తెరలేపారు. సీట్ల పంపిణీ తేలేవరకూ విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) భేటీలు ఛాయ్, సమోసాకే పరిమితమవుతాయని జేడీ(యూ) నేత సునీల్ కుమార్ పింటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధానిపై తాను ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ హిందీ రాష్ట్రాలు మోదీ పట్ల విశ్వాసం కనబరిచాయని, తాను వాస్తవాలే మాట్లాడానని అన్నారు.
ప్రజల అభిమతాన్ని మనం అర్ధం చేసుకుని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన వ్యూహాలను రూపొందించుకోవాలని ఆయన సూచించాచు. తాను బీజేపీతోనే ఉంటానని, తన హృదయం కాషాయ పార్టీతోనే ఉంటుందని పింటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ పంపితేనే జేడీ(యూ)లోకి వచ్చానని, తమ నేత బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరిన వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ ఎన్నికల నినాదాన్ని ప్రశంసించిన అనంతరం బిహార్లో జేడీయూ నేత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం అనంతరం సీతామర్హి ఎంపీ పింటూ చేసిన వ్యాఖ్యలు విపక్ష ఇండియా కూటమిలోనూ హాట్ టాపిక్గా మారాయి.
Read More :