Encounter | జమ్మూ కశ్మీర్ కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఈ ఘటనలో బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాను సైతం గాయపడ్డాడు. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఆపరేషన్కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మంగళవారం ఉత్తర కశ్మీర్ సరిహద్దు జిల్లా కుప్వారాలోని లోలాబ్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఆ తర్వాత ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
భారత సైన్యం చినార్ కార్ప్స్, కుప్వారాలోని కౌట్ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై పక్కా సమాచారం అందింది. ఈ మేరకు సైన్యం, జమ్మూ కశ్మీర్లో పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. బుధవారం అనుమానాస్పద కదలికలు కనిపించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు తప్పికొట్టాయి. దాంతో ఓ ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. కుప్వారా పోలీసులు, 28, 22 నేషనల్ రైఫిల్స్ ఆఫ్ ఆర్మీ సైనికులతో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కార్డన్ బిగించడం చూసి ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పూంచ్లో చొరబాటు పథకం విఫలమైంది. ఓ సైనికుడు వీరమరణం పొందాడు.
మంగళవారం ఉదయం భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వద్ద కృష్ణాలోయలోని బట్టాల్లో సరిహద్దు ఆవల నుంచి చొరబాటు కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందాడు. వీరమరణం పొందిన సైనికుడిని లాన్స్ నాయక్ సుభాష్ చంద్రగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా సాదాబాద్ తహసీల్లోని నాగమణి గ్రామ నివాసి. సోమవారం రాత్రి ఈ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో పాక్ ఆక్రమిత బట్టాల్ ప్రాంతం నుంచి తెల్లవారుజామున 3 గంటలకు ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు చొరబడడం సైనికులు గమనించారు. ఆ తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్తో లాన్స్ నాయక్ సుభాష్ చంద్ర తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఫార్వర్డ్ పోస్టు వద్దకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేస్తుండగా మృతి చెందారు.