Jairam Ramesh : రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. పార్టీ సీనియర్ నేతలు కొందరు హిమాచల్ ప్రదేశ్లో పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని, ఆపై పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు నివేదిక సమర్పిస్తారని చెప్పారు.
హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జైరాం రమేష్ ఆరోపించారు. ఇక ఎవరైనా పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించమని, పార్టీ అగ్రనాయకత్వం కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, ఏఐసీసీ ఇన్చార్జ్ రాజీవ్ శుక్లా సిమ్లాలో ఉన్నారని, వారు ఎమ్మెల్యేలందరితో కలిసి వారి డిమాండ్లపై చర్చలు జరుపుతున్నారని చెప్పారు. పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యులపై చర్యలు ఉంటాయని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
Read More :
Nizam fuel Tank | నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్.. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కులో గుర్తింపు