నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ ఇది. జూబిలీహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులో కొన్నేండ్లుగా పడి ఉంది. హైదరాబాద్ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోలు పోసేందుకు ఈ ప్రైవేటు పంప్ను ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజు ఎంతోమంది ఉదయం ఈ పార్కుకు వాహ్యాళికి వస్తున్నా.. రాజు అల్లూరి అనే వ్యక్తి ఇటీవల దీనిని గుర్తించారు. డివిజనల్ అటవీ అధికారి రూపొందించిన పార్కు మేనేజ్మెంట్ ప్లాన్ ఆధారంగా ఆ పంప్ నేపథ్యాన్ని కనుగొన్నారు.