Jairam Ramesh : వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ లక్ష్యంగా తరచూ విమర్శలు గుప్పించే బీజేపీని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ నిలదీశారు. కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించారని, ఆయన మరో కుమారుడు బీవై రాఘవేంద్ర శివమొగ్గ ఎంపీగా వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు. పార్టీ నేత కుటుంబసభ్యులకు పదవులు కట్టబెట్టిన కాషాయ పార్టీ వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీల గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదమని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
శివమొగ్గలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ కర్నాటక రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించాలని జైరాం రమేష్ కోరారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని నివారించడంతో పాటు ఉపాధి హామీ కార్మికుల వేతనాలు చెల్లించాలని కాంగ్రెస్ నేత మోదీని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు కరవు పరిస్ధితులు ఎదుర్కోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని జైరాం రమేష్ గుర్తుచేశారు.
కరవు సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 18,172 కోట్లు విడుదల చేయలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని అన్నారు. కర్నాటక ప్రజలను ఆదుకోవడంలో మోదీ సర్కార్ ఎందుకు విముఖత చూపుతోందని జైరాం రమేష్ ప్రశ్నించారు. ఉపాధి హామీ పధకం విస్తరణకు ఆమోదం తెలపడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం ఈ పధకం కింద పనిచేసిన కార్మికుల వేతనాల కోసం రూ. 1600 కోట్లు విడుదల చేయడంలోనూ విఫలమైందని ఆయన ఆరోపించారు.
Read More :
Tamilisai | తమిళిసై ఎక్కడ్నుంచి పోటీ..? తూత్తుకుడినా..! పుదుచ్చేరినా..!!