శ్రీనగర్: జమ్మూకశ్మీర్, పంజాబ్లో డ్రై ప్రూట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నవారిపై ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాపారుల వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు సుమారు 200 కోట్లు ఉన్నట్లు ఐటీశాఖ అధికారులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 14 బ్యాంక్ లాకర్లను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఐటీశాక అధికారులు 63 లక్ష నగదును, 2 కోట్ల ఖరీదైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 28వ తేదీన జమ్మూకశ్మీర్తో పాటు పంజాబ్ రాష్ట్రాల్లో డ్రై ఫ్రూట్స్ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఐటీ దాడులు జరిగాయి. డ్రై ఫ్రూట్స్ ప్రాసెసింగ్, ట్రేడింగ్లో నిమగ్నమైన వ్యాపారవేత్తలను టార్గెట్ చేశారు.