Somanath | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 (GSLV-F14) ప్రయోగం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట (Sullurpet)లోని చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని (Sri Chengalamma Parameshwari temple) ఇస్రో చైర్మన్ (ISRO Chairman) ఎస్ సోమనాథ్ (S Somanath) సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ చేపట్టబోయే జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు.
మరోవైపు ఇన్శాట్-3డీఎస్ (INSAT-3DS) వాతావరణ ఉపగ్రహానికి కౌంట్డౌన్ మొదలైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 వ్యోమనౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నారు. మూడో తరం వాతావరణ ఉపగ్రహమైన ఇన్శాట్- 3డీఎస్ను భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర భూ విజ్ఞాన శాఖ ఈ ఉపగ్రహ ప్రయోగానికి నిధులు సమకూర్చింది.
#WATCH | ISRO Chairman S Somnath offered prayers at
at Sri Chengalamma Temple in Sullurpet of Andhra Pradesh today, ahead of meteorological satellite INSAT-3DS launch from Sriharikota pic.twitter.com/0KVd8gRvi7— ANI (@ANI) February 17, 2024
Also Read..
TS Assembly | నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. స్వల్పకాలిక చర్చ
Heart attacks | యుక్త వయసుకు గుండె గండం.. మూడు పదులకే మూగబోతున్న హృదయం..!
Garlic price | కిలో రూ.500కు చేరిన ఎల్లిగడ్డ.. పొలాల్లో సీసీ కెమెరాలు పెడుతున్న రైతులు..!