Garlic price | దొంగతనాలకు చెక్ పెట్టడానికి, ఒకవేళ దొంగతనం జరిగినా దొంగలను సులువుగా పట్టుకోవడానికి ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు సీసీ కెమెరాలు అమర్చుకోవడం సర్వసాధారణమే. కానీ ఇపుడు ఎల్లిగడ్డల ధరల పుణ్యమా అని పంటపొలాల్లో కూడా సీసీ కెమెరాలు ప్రత్యక్షమవుతున్నాయి. గత ఏడాది టమాటా ధరలు భారీగా పెరిగినప్పుడు కూడా రైతులు వీటి వైపు మొగ్గు చూపారు.
ఇప్పుడు ఎల్లిగడ్డ గడ్డ ధర రూ.500కు పెరగడంతో పంట పొలాల నుంచే వాటిని ఎత్తుకెళ్తున్నారు. దాంతో పంటను కాపాడుకోవడం కోసం పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లా మోహ్ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయి.