TS Assembly: రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో నీటిపారుదలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అధికార పక్షం స్పీకర్ అనుమతి కోరింది. దాంతో స్పీకర్ అందుకు అనుమతించారు. అయితే పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం అధికారపక్షం టెక్నీషియన్ను తీసుకురావడంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
సభలో సభ్యులు కాని వారిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం ఎలా అనుమతిస్తారని హరీశ్రావు ప్రశ్నించారు. దాంతో కేసీఆర్ హయాంలోనూ పవర్పాయింట్ ప్రజంటేషన్కు టెక్నీషియన్ను అనుమతించారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు అన్నారు. శ్రీధర్బాబు చెప్పింది అబద్ధమని హరీశ్రావు అన్నారు. అప్పట్లో కేసీఆరే స్వయంగా పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి స్వయంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. సభలోకి ఇతరులను అనుమతించడం సభా సాంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.