Iran | న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఇరాన్ను సందర్శించాలనుకునే భారత పర్యాటకులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా లేకుండానే ఆ దేశాన్ని సందర్శించవచ్చని ప్రకటించింది. భారత్ సహా 33 దేశాల వారు వీసాల లేకుండా తమ దేశాన్ని సందర్శించవచ్చునని ఇరాన్ దేశ మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ఆ దేశ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్గమి బుధవారం వెల్లడించారు.
మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ దేశానికి వచ్చే విదేశీ సందర్శకుల సంఖ్యను పెంచి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఇరాన్ ఫోబియా ప్రచారానికి దీంతో అడ్డుకట్ట పడుతుందన్నారు.