Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం పలు విమానాలకు వరుస బెదిరింపులు వచ్చాయి. ముందుగా ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండిగో (IndiGo)కు చెందిన రెండు విమానాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
ముంబై నుంచి జెడ్డా (Mumbai to Jeddah)కు వెళ్తున్న 6E 56, ముంబై నుంచి మస్కట్ (Mumbai to Muscat)కు వెళ్తున్న 6E 1275 విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది విమానాలను వెంటనే ఐసోలేషన్ రన్వేకు తరలించినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని భద్రతా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.
IndiGo flight 6E 56 operating from Mumbai to Jeddah received a bomb threat. As per protocol, the aircraft was taken to an isolated bay, and following the standard operating procedures, mandatory security checks were promptly initiated: Indigo Spokesperson https://t.co/okfUhrdQ63
— ANI (@ANI) October 14, 2024
కాగా, సోమవారం ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ119 విమానం 239 మంది ప్రయాణికులతో ముంబై నుంచి న్యూయార్క్కు వెళ్తున్నది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అనంతరం ప్రయాణికులను అంతా దించివేసి.. ఐసోలేషన్ రన్వేకు తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
Also Read..
Air India | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Donald Trump | ట్రంప్పై మరోసారి హత్యా ప్రయత్నం.. ర్యాలీలో తుపాకీలతో వ్యక్తి హల్చల్
President’s Rule | ఆరేండ్ల తర్వాత.. జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత