న్యూఢిల్లీ: రష్యా వద్ద డిస్కౌంట్లో ఇండియా ఆయిల్ కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే న్యాయబద్ధంగా జరుగుతున్న ఇంధన లావాదేవీలను రాజకీయం చేయరాదు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధం వల్ల ప్రస్తుతం గ్లోబల్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అయితే రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశం తమ వద్ద ఉన్న ఇంధన నిల్వలను క్లియర్ చేసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇండియాకు తక్కువ ధరలో ఆయిల్ను అమ్మే ప్రయత్నం చేస్తోంది.
డిస్కౌంట్లో చమురును కొనేందుకు ఇండియా కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ ఎక్కువగా ఇంధన దిగుమతులపై ఆధారపడుతుందని, దాదాపు 85 శాతం ముడి చమురును మనం దిగుమతి చేసుకుంటామని, ఎక్కువ శాతం వెస్ట్ ఆసియా దేశాల నుంచి ఆయిల్ వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరాక్ నుంచి 23, సౌదీ నుంచి 18, యూఏఈ నుంచి 11, అమెరికా నుంచి 7.3 శాతం ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇరాన్, వెనిజులా నుంచి దిగుమతు ఆపేశామని, ఉక్రెయిన్ వార్తో ఇంధన ధరలు సవాల్గా మారినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
రష్యా నుంచి కేవలం ఒక శాతం మాత్రమే మనం ఆయిల్ తెస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తిదారులు ఇచ్చే ఆఫర్లకు వెల్కమ్ చెబుతున్నామని ప్రభుత్వం వెల్లడించింది. రష్యా నుంచి మూడు బిలియన్ల బ్యారెళ్ల చమురును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది.