Indian Railway | భారతీయల రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో రైళ్లను నడుపుతున్నది. ఈ క్రమంలోనే దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థగా నిలిచింది. టికెట్ల ధర తక్కువ ఉండడంతో పాటు మెరుగైన భద్రతను దృష్టిలో పెట్టుకొని రైళ్లలోనే ప్రయాణం చేసేందుకు మక్కువ చూపుతారు. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారంతా సుఖవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. ఇక రైలులో ప్రయాణించడానికి టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సిందే.
దాదాపు ప్రయాణానికి 60 రోజుల ముందే టికెట్ల బుక్ చేసుకునేందుకు రైల్వేశాఖ అవకాశం కల్పిస్తుంది. అలాగే, అత్యవసర సమయాల్లో ప్రయాణించాలనుకునే కోసం సైతం తాత్కాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. అయితే, ఈ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటున్నది. చాలామంది ప్రయాణికులకు బెర్తులు కన్ఫర్మ్ కావడంలో లేదు. దాంతో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, రైలు ప్రయాణానికి ముందు చార్ట్ సిద్ధమయ్యే విషయం అందరికీ తెలిసిందే. చార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా రైలులో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కానీ, ఈ విషయం చాలామందికి తెలియదు. భారతీయ రైల్వే దేశంలోని అనేక స్టేషన్లలో కరెంట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఆయా కౌంటర్లలో ప్రయాణికులు రైలు బయలుదేరే కొద్దిసేపటి ముందు రైలులో మిగిలిపోయిన బెర్తులను బుక్ చేసుకోవచ్చు.
చాలాసార్లు రైలులో చార్ట్ సిద్ధమయ్యాక సీట్లు ఖాళీగా మిగిలిపోతుంటాయి. ఈ క్రమలో ఖాళీ సీట్లను దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ కరెంట్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు చార్ట్ తయారవుతుంది. చార్ట్ రెడీ అయ్యాక రైలు బయలుదేరే ఐదు, పదినిమిషాల ముందు సైతం కరెంట్ టికెట్ బుకింగ్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. చార్ట్ తయారు చేసిన తర్వాత, రైలులో సీట్లు ఖాళీగా ఉంటే.. ప్రయాణికులకు కరెంటు బుకింగ్ విధానంలో టికెట్ జారీ చేస్తారు. అయితే, రైలులో బెర్తులు ఖాళీగా ఉంటే మాత్రమే బెర్తులు కన్ఫర్మ్ అవుతాయి. లేకపోతే బెర్త్ దొరికే అవకాశం ఉండదు.
Year Ender 2024 | ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సినీతారలు వీళ్లే..!
Year Ender 2024 | ఓటర్లతో మామూలుగా ఉండదు..! లోక్సభ నుంచి అసెంబ్లీ వరకు ఊహించిన ఫలితాలు..!