న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ (Covid-19) కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 8895 కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి మరో 5 వందల కేసులు తగ్గాయి. దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,41,561కు చేరింది. ఇందులో 3,40,69,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి వల్ల 4,73,537 మంది మృతిచెందారు. మరో 98,416 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 552 రోజుల్లో ఇది కనిష్టమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 211 మంది మరణించగా, 8834 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది.