Coronavirus | భారత్లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 4,44,77,272 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
COVID-19 | India reports 602 new cases, 5 deaths in the last 24 hours; Active caseload at 4,440
— ANI (@ANI) January 3, 2024
263కి చేరిన జేఎన్.1 కేసులు
ఇదిలా ఉండగా.. భారత్లో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో ఈ తరహా కేసులు తాజాగా 200 దాటాయి. ఇప్పటి వరకూ జేఎన్.1 కేసులు 263కు చేరినట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మంగళవారం వెల్లడించింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించిందని పేర్కొంది. ఇక ఈ తరహా కేసులు కేరళలోనే అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఏకంగా 133 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గోవాలో 51, గుజరాత్లో 34, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కేసు నమోదైనట్లు వెల్లడించింది. మొత్తం కేసుల్లో 239 కేసులు డిసెంబర్లో వెలుగు చూడగా.. 24 కేసులు నవంబర్ నెలలో బయటపడినట్లు ఇన్సాకాగ్ వివరించింది.
Also Read..
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
ED raids | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చుట్టూ ఈడీ ఉచ్చు.. సన్నిహితుల ఇళ్లలో సోదాలు.. Video
Japan Earthquake | శిథిలాల కింద మృతదేహాలు.. 62కు చేరిన జపాన్ భూకంప మరణాలు