India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 2 వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 1,59,454 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,109 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,74,909కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 21,406 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,21,781 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,722కి చేరింది.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.77 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,84,570 ) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Jeera | చుక్కలు చూపిస్తున్న జీలకర్ర ధరలు.. కేజీకి రూ.540 నుంచి 560
Accident | రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. పది మందికి గాయాలు
TS EAMCET | ప్రారంభమైన ఎంసెట్ ఎగ్జామ్.. రెండు సెషన్లలో పరీక్ష