న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,60,470కి చేరాయి. ఇందులో 3,36,41,175 మంది కోలుకోగా, 1,61,555 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,57,740 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 7,722 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మరో 471 మంది కరోనాకు బలయ్యారు.
ఇక గత 24 గంటల్లో 13,543 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడగా, 549 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.19 శాతం ఉన్నదని, యాక్టివ్ కేసులు 0.47 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపింది.