Maldives | వెకేషన్.. అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మాల్దీవ్సే (Maldives). సెలబ్రిటీలు సైతం తరచూ మాల్దీవ్స్కే ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడి బీచ్లు, రిసార్ట్స్లో సేద తీరుతుంటారు. ట్రిప్కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్గా పెట్టుకుంటుంటారు. అయితే, తాజాగా ఈ పర్యాటక ప్రాంతంపై ఇప్పుడు వివాదం నెలకొంది.
ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ (Lakshadweep ) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు.. తమ లిస్టులో లక్షద్వీప్ను చేర్చుకోవాలని సూచిస్తూ ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్పై మాల్దీవుల మంత్రులు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల వ్యాఖ్యలతో ఆ దేశ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ దేశం అంతా పర్యాటక రంగంపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇక ఏటా మాల్దీవులను సందర్శించే పర్యాటకుల్లో భారతీయులే అత్యధికం. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల్లో భారత్ తొలిస్థానంలో ఉండటం విశేషం.
ఆ దేశ టూరిజం శాఖ డేటా ప్రకారం.. 2023లో మాల్దీవులను సందర్శించిన వారిలో అత్యధికంగా భారతీయులే ఉండటం గమనార్హం. గతేడాది ఏకంగా 2 లక్షల మందికిపైనే భారతీయ పర్యాటకులు ఆ ద్వీప దేశాన్ని సందర్శించారు. రష్యా, చైనా దేశాలు భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రష్యా నుంచి గతేడాది మాల్దీవ్స్ను 209,146 మంది సందర్శించగా.. 187,118 మంది చైనీయులు ద్వీపదేశ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్, జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలు ఉన్నాయి.
తాజా పరిణామాలతో భారత పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు భారతీయులంతా లక్షద్వీప్వైపు మొగ్గుచూపుతున్నారు. మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక కేంద్రంగా లక్షద్వీప్ను భారత్ అభివృద్ధి చేస్తే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు భారీగా గండిపడే అవకాశం ఉంది. దీంతో మాల్దీవ్స్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారతీయులు లక్షద్వీప్కే వెళ్లాలి..
మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ, రాజకీయ, క్రీడాప్రముఖులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై భారతీయులు లక్షద్వీప్కే వెళ్లాలని, పర్యాటకంగా మాల్దీవులని బాయ్కాట్ చేయాలని కోరారు. భారత్లోని తీరప్రాంతాలు, దీవుల్లోని అందమైన బీచ్లకు సందర్శించండి.. అంటూ తమ అభిమానులను బాలీవుడ్ సినీ నటులు సల్మాన్ఖాన్, అక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, వెటరన్ క్రీడాకారుడు వెంకటేశ్ ప్రసాద్ కోరారు. తన 50వ పుట్టినరోజును కొంకణ్ తీరంలో జరుపుకున్నానని సచిన్ టెండుల్కర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్లో ‘బాయ్కాట్మాల్దీవ్స్’ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది.
Also Read..
Maldives | ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు
Maldives | భారత్, ప్రధాని మోదీపై వ్యాఖ్యలను ఖండించిన మాల్దీవుల మాజీ మంత్రి అబ్దుల్లా